ప్రెషర్ కుక్కర్‌లో బంగారం.. చివరికి ఓపెన్ చేసి చూస్తే..

Update: 2019-08-09 05:15 GMT

నగలను శుభ్రం చేయిస్తామని నమ్మబలికి మూడు సవర్ల బంగారు చెయిన్ కొట్టేసిన ఘటన చిత్తూరు జిల్లా గుడిపాలలోని మరకాలకుప్పంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే మరకాలకుప్పం దళితవాడకు చెందిన మరకాలకుప్పం దళితవాడకు చెందిన మంజుల (40) ఇంటివద్ద ఉదయం 10గంటలకు ఒక మోటర్ సైకిల్ పై ఇద్దరు ఆగంతకులు మంజుల ఇంటి ముందు దిగారు. వచ్చినా వారిద్దరు హిందీలో లాడలాడ మాట్లాకున్నారట.. ఆ తరువాత మంజులను పిలిచి తాము బంగారు, వెండి వస్తువులు, నగలను తళతళలాడేలా శుభ్రంచేస్తామంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆమె వెంటనే తన కాలికి ఉన్న కాళ్లపట్టీలను ఇచ్చింది. వారు ఆ పట్టిని తలతల లాడేలా చేసి ఇచ్చారు. దీంతో వెంటనే తన మెడలో ఉన్న మూడుసవర్ల బంగారాన్ని కూడా వారికి ఇచ్చింది. ప్రెషర్ కుక్కర్‌లో చైన్ వేసినట్టు నటించారు. కుక్కర్ చల్లబడ్డాక మూత తీసి పరిశీలించమని చెప్పి వెళ్లిపోయారు. అయితే వారు చెప్పేది నిజమేనని గుడ్డిగా నమ్మింది ఆ మహిళ.

అయితే వారు వెళ్లిన కొద్దిసేపటికే కుక్కర్ కూడా చల్లబడడంతో నా నగలు ఎలా ఉన్నాయో.. దగదగ మేరిసిపోతున్నాయో అని ముఖంలో చిరునవ్వుతో కుక్కర్ దించి ఓపేన్ చేసే సరికి ఒక్కసారిగా గుండె ఆగేంత పనిఅయింది. అందులో చల్లరిన నీళ్లు మరేమిలేదు.. దీంతో ఒక్కసారిగా కంగు తిన్న మహిళ లాబోదిబోమని ఎడ్చేసింది. వాళ్లకోసం అక్కడక్కడ వెతికింది. అయినా వారి జాడ దొరకలేదు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ షేక్‌షావలి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News