గగన్‌పహాడ్‌లో రెండేళ్ల పాప కిడ్నాప్‌!

శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్‌లో రెండేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. చాక్లెట్స్, బిస్కెట్స్ ఇప్పిస్తామని గుర్తు తెలియని వ్యక్తి పాపను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

Update: 2019-08-23 01:39 GMT

శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్‌లో రెండేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. చాక్లెట్స్, బిస్కెట్స్ ఇప్పిస్తామని గుర్తు తెలియని వ్యక్తి పాపను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శ్రవణ్ కుటుంబంతో కలిసి ఐదేళ్ల క్రితం గగన్ పహాడ్‌కు వచ్చాడు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉండగా ఇద్దరు స్కూల్‌లో చదువుతున్నారు. మూడో కుమార్తె సాయంత్రం సమయంలో ఇంటి దగ్గర ఆడుకుంటుండగా కనిపించకుండా పోయింది. దీంతో పరిసరాల్లో వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News