ఘోర రోడ్డు ప్రమాదం, మాజీ ఎమ్మెల్యే మృతి

Update: 2019-04-07 02:53 GMT

తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు మృతి చెందారు. వేలూరు జిల్లా తిరుపత్తూరు మాజీ ఎమ్మెల్యే సుందరవేల్‌(71) ఆయన భార్య విజయలక్ష్మి(65) శనివారం ఉదయం చెన్నైలోని ఆస్పత్రికి కారులో బయలుదేరారు. అయితే ఉదయం 6 గంటలకు ఆంబూరు సమీపంలోని విన్నమంగళం వద్ద వస్తున్న సమయంలో కంటైనర్‌ను ఓవర్‌ టేక్‌ చేయడానికి ప్రయత్నించారు. వాహనం అదుపు తప్పి కంటైనర్‌ వెనుకభాగం ఢీకొంది.

దీంతో ఆ కంటైనెర్ కిందకు వెళ్లి చిక్కుకుంది.కారులో ఉన్న మాజీ ఎమ్మెల్యే సుందరవేల్‌ ఆయన భార్య విజయలక్ష్మి అక్కడిక్కడే మృతి చెందారు , మరో వ్యక్తి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సుందరవేల్‌ 1991–96 వరకు తిరుపత్తూరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా పనిచేశారు. 2001 నుంచి 2006 వరకు తిరుపత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నారు.

Similar News