ఘోర అగ్ని ప్రమాదం.. 56 మంది సజీవదహనం

Update: 2019-02-21 02:35 GMT

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో దాదాపు 56 మంది మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఢాకాలోని చాక్‌బజార్‌లోని ఓ అపార్టుమెంటులో జరిగింది. గురువారం రాత్రి అపార్టుమెంటులో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దాంతో అపార్టుమెంటులో కెమికల్‌ వేర్‌హౌజ్‌ కూడా ఉండటంతో చుట్టూ ఉన్న భవనాలకు కూడా మంటలు రాజుకున్నాయి. దీంతో 56 మంది అక్కడిక్కడే సజీవదహనం అయ్యారు.

మరో 20 మందికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా క్షతగాత్రుల్లో కొంత మంది మృతి చెందే అవకాశం ఉందని బంగ్లాదేశ్‌ ఫైర్‌ సర్వీస్‌ చీఫ్‌ అలీ అహ్మద్‌ తెలిపారు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని వెల్లడించారు. 

Similar News