ఏలేశ్వరంలో అదృశ్యమైన బాలుడు తీవ్ర గాయాలతో ...

Update: 2019-08-09 06:30 GMT

ఏలేశ్వరం బాలుడి అదృశ్యం కథ సుఖాంతమైంది. ఏలేశ్వరంలో అదృశ్యమైన బాలుడు తోట ధనుష్‌ ఆచూకీని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా పలు నిజాలను బయటపెట్టాడు.అనంతరం నిందితుడి ఇచ్చిన సమాచారంతో బాలుడిని కాపాడారు పోలీసులు. ఏలేశ్వరం డిగ్రీ కాలేజీ దగ్గర బాలుడు తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కొన ఊపిరితో ఉన్న బాలుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సమీప బంధువే బాలుడిని కిడ్నాప్‌ చేసి వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. ఏలేశ్వరంలోని పాఠశాలకు వెళ్లి ధనుష్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు ఛేదించారు. 

Tags:    

Similar News