మందుబాబులకు ఎంతచెప్పినా మారడంలేదు. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. నిన్న రాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనీఖీలో దాదాపు వందమంది మందుబాబులు మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తూ దొరికారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 82 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే దాదాపు 49 కార్లు, 32 బైక్లు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. తాము ఎంత చెప్పినా వినకుండా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని.. అలా చేస్తే కేవలం ఫైన్ కట్టవచ్చు అనుకుంటున్నారు.. కానీ ఇందులో కూడా కఠినమైన శిక్షలు ఉన్నాయన్న విషయాన్నీ గ్రహించాలంటున్నారు పోలీసులు.