ఇరానీ గ్యాంగ్ ఆటకట్టించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్
శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న ముఠాల ఆగడాలకు సైబరాబాద్ పోలీసులు బ్రేక్ వేశారు. చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్కు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.
శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న ముఠాల ఆగడాలకు సైబరాబాద్ పోలీసులు బ్రేక్ వేశారు. చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్కు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. మరో దొంగ పరారీలో ఉన్నారు. వీరు గతేడాది అక్టోబర్లో సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 5 గంటల వ్యవధిలో 6 దొంగతనాలకు పాల్పడ్డారు. శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడిలకు పాల్పడ్డారు. వారి నుంచి 11 లక్షల విలువైన 32.5 తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా బాధితులు ఎలా మోసపోతారో సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరించారు.