కాంగ్రెస్‌ నేత రమేష్‌ రాథోడ్‌కు తీవ్ర గాయాలు

Update: 2019-04-10 01:09 GMT

 ఆదిలాబాద్‌ మావల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్‌ నేత రమేష్‌ రాథోడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వాహనం చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రమేష్‌ రాథోడ్‌ బరిలో ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. 

Similar News