హైదరాబాద్లో ఓ యువతిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం కలకలం రేపుతోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు కామారెడ్డికి చెందిన ఓ యువతిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఉపాది శిక్షణ కోసం నగరానికి వచ్చిన ఆమెపై గర్భం దాల్చే ప్రయోగాలు నిర్వహించారు. దీంతో ఆమెకు ఇచ్చిన మందులు వికటించడంతో పరిస్థితి సీరియస్గా మారింది. దీంతో ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు బాధితురాలిని అమీర్పేట్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. హాస్పిటల్కు చేరిన సమయంలో యువతి పరిస్థితి సీరియస్గా ఉందని ప్రస్తుతానికి ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.