తోసుకున్న విద్యార్థులు.. మంటలు చెలరేగడంతో గాయాలు

Update: 2019-01-28 15:49 GMT

చిత్తూరు జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం చర్లపల్లెలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అగ్నిప్రమాదం జరగడంతో మంటల్లో చిక్కుకుని ఆరుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. డిజిటల్‌ క్లాసులు ఉన్నాయని ఉపాధ్యాయులు చెప్పడంతో విద్యార్థులు డిజిటల్‌ గదికి చేరుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఒకరినొకరు తోసుకున్నారు. దాంతో యాసిడ్‌ బాటిల్స్‌ కిందపడి మంటలు రేగాయి. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

Similar News