ప్రముఖ పారిశ్రామికవేత్త కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో సినీనటుడు సూర్య, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డి, కిశోర్ ని అదుపులోకి తీసుకున్నారు. వీరు జయరాం మృతదేహాన్ని చూసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై విచారణ చేపట్టారు.