హత్యకు గురైన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం మృతి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మేనమామ జయరాంకు తనకూ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆమె అంగీకరించింది. అలాగే తనకూ రాకేష్ రెడ్డికి ఓ విల్లా విషయంలో గొడవ అయ్యిందని.. అయితే మామ జయరామ్ను అతను చంపుతాడని అనుకోలేదని పోలీసులకు చెప్పింది శ్రిఖా చౌదరి. కాగా చెక్ పవర్ మొత్తం జయరామ్ భార్య పద్మజ పేరుతో ఉందని వెల్లడించింది.