ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. యువతి ఆత్మహత్యాయత్నం

Update: 2019-04-24 02:31 GMT

ప్రియుడు పెళ్ళికి నిరాకరించాడన్న కారణంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లోని కాచిగూడలో చోటుచేసుకుంది. తిలక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌ కుమార్తె కె.లోచన ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మిర్యాలగూడకు చెందిన దోసాపాటి సిద్దార్థతో షాదీ డాట్‌కామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. దీంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో లోచన పెళ్లి ప్రస్తావన తేగా సిద్దార్థ నిరాకరించాడు. దీంతో మనస్థాపం చెందిన లోచన నెయిల్‌ పాలీష్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లోచన కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News