కృష్ణా జిల్లా మంగళగిరికి సమీపంలోని ఉండవల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, స్కూటర్ ఢీకొన్నాయి. బైక్పై ఉన్న వ్యక్తి వాహనానికి బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న వాహనాలు రెండూ బలంగా ఢీకొట్టుకోవడంతో బైక్పై ఉన్న వ్యక్తి ఎగిరి బొలెరోపై పడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.