ఘోర ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం..

Update: 2019-03-23 15:37 GMT

కృష్ణా జిల్లా మంగళగిరికి సమీపంలోని ఉండవల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, స్కూటర్ ఢీకొన్నాయి. బైక్‌పై ఉన్న వ్యక్తి వాహనానికి బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న వాహనాలు రెండూ బలంగా ఢీకొట్టుకోవడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి ఎగిరి బొలెరోపై పడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు. 

Similar News