నటుడు శివాజీ పాస్ పోర్ట్ సీజ్.. 11 న విచారణకు హాజరు కావాలని ఆదేశం

Update: 2019-07-03 07:25 GMT

అలాండా మీడియా కేసులో ఈరోజు అదుపులోకి తీసుకున్న నటుడు శివాజీని పోలీసులు ఇంటికి పంపించేశారు. సుమారు మూడు గంటల పాటు కేసుకు సంబంధించిన విషయాలపై ఆయననుఁ విచారించిన పోలీసులు తరువాత ఆయనను వదిలి వేశారు. అయితే, అయన పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. తిరిగి ఈనెల 11 వ తేదీన విచారణకు హాజరు కావాలని శివాజీని ఆదేశించారు. 

అమెరికాకు వెళ్ళడానికి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లిన నటుడు శివాజీ ని ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలువరించి, సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీనితో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు సైబరాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News