నటుడు, మాజీ ఎంపీ రితీష్‌ హఠాన్మరణం

Update: 2019-04-13 12:58 GMT

ప్రముఖ నటుడు, డిఎంకే మాజీ ఎంపీ జేకే రితీష్‌ (46) హఠాన్మరణం చెందారు. శనివారం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన మృతిచెందినట్టు సమాచారం. ఆయనకు గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. ఈలోపే ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. 2009 లోకసభ ఎన్నికలలో డిఎంకే అభ్యర్థిగా రామనాథపురం నుంచి ఎంపీగా ఎంపిక ఆయన..

పార్టీ వేరైనా అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితుడు. ఆయన అకాలమరణంపై పలువురు సినీరాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక‍్తం చేశారు. ఆర్‌జే బాలాజీ హీరోగా నటించిన తొలి చిత్రం, రాజకీయ వ్యంగ్య చిత్రం 'ఎల్‌కేజీ' లో రితీష్ కీలక పాత్రను పోషించారు.

Similar News