8 మందిని పెళ్లి చేసుకొని అడ్డంగా దొరికిన నిత్య పెళ్లికొడుకు‌

Visakhapatnam: పెళ్లి అనంతరం వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

Update: 2021-03-31 07:30 GMT

Representational Image

Visakhapatnamవిశాఖలో నిత్య పెళ్లికొడుకు అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 8 మందిని ప్రేమపెళ్లి చేసుకున్న అరుణ్‌ కుమార్.. పెళ్లి అనంతరం వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మొదటి భార్య కుమార్తెను వ్యభిచార ముఠాకు అమ్ముతానంటూ వేధింపులకు గురి చేయడం మాట వినకపోతే తుపాకులు, కత్తులతో బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలు కంచరపాలెం పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అసలు విషయాలు వెలుగుచూశాయి. అరుణ్‌కుమార్‌కు గంజాయి, వ్యభిచారముఠాలతో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News