ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 34 మందికి గాయాలు

Update: 2019-04-21 02:41 GMT

ఆగ్రా - లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును ట్రక్కు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా అక్కడిక్కడే మృతిచెందారు. మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News