ఆరుకు చేరుకున్న గాజువాక మృతుల సంఖ్య

Update: 2019-02-25 07:03 GMT

గాజువాక స్వతంత్య్రనగర్‌ కాలనీలో కల్తీ ద్రావణం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 6 కు చేరింది. ఇవాళ తెల్లవారుజామున మరొకరు మృతిచెందారు. ఆసనాల రమణమ్మ అనే మహిళ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మరో ఆరుగురు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

ఇటు గాజువాక ఎస్టీ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ ఎక్సైజ్‌ అధికారులు మరియు పోలీసులు ఆ ప్రాంతాన్ని సందర్శించి ఘటనపై విచారిస్తున్నారు. ఇటు నిన్న మృతిచెందిన అప్పలమ్మ డెడ్‌బాడీని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. 

Similar News