అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ వాసి మృతిచెందాడు. యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలం రహింఖాన్పేట గ్రామానికి చెందిన గోవర్దన్రెడ్డి…. ఏడేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడే స్టోర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. 19వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో నల్లముగుసు వేసుకున్న దుండగులు…. స్టోర్లోకి ప్రవేశించారు. డబ్బు ఇవ్వమని దుండగులు ఆయనను కొట్టినట్టు తెలుస్తోంది. గోవర్దన్రెడ్డి వారిపై తీవ్రంగా ప్రతిఘటించడంతో గోవర్దన్రెడ్డితో పాటు మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. దీంతో గోవర్దన్రెడ్డి అక్కడిక్కడే మృతిచెందగా… మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు స్టోర్లో దొంగతనానికి వచ్చినట్లు నిర్ణయానికి వచ్చారు. ఇక గోవర్దన్రెడ్డి మృతితో ఆయన స్వగ్రామం రహింఖాన్పేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. హైదరాబాద్ ఉప్పల్లోని స్వరూప్నగర్లో ఉంటున్న కుటుంబ సభ్యులకు .. గోవర్దన్ మృతి వార్త తెలియడంతో వారు స్వగ్రామానికి బయలుదేరారు. మరో రెండు నెలల్లో ఇండియాకు తిరిగి రావలసి ఉండగా ఇలా జరగడంతో గోవర్దన్రెడ్డి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.