విహారయాత్రలో విషాదం..

Update: 2019-04-18 03:21 GMT

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా విహార యాత్రకు వెళ్లిన ముగ్గురు యువకులు ప్రధవశాత్తు గోదావరి నదిలో మునిగారు. ఈ ఘటన పెరవలి మండలం కాకరపర్రు వద్ద గోదావరినదిలో జరిగింది. ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నవీన్ కుమార్ అనే యువకుడు ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నాడు. జిల్లాలోని తాడేపల్లిగూడేనికి చెందిన నలుగురు యువకులు గోదావరి తీరానికి విహారం కోసం వచ్చారు.

కాకరపర్రు వద్ద గోదావరి ఒడ్డున గంటల తరబడి గడిపిన వారు.. కాకరపర్రు గ్రామం వైపునుంచి గోదావరిలో అవతలివైపునకు నడిచివెళ్లి తిరిగి వచ్చే క్రమంలో గల్లంతయ్యారు. ముత్యాల మణికుమార్, సాయికిరణ్, వంశీ గల్లంతయ్యారు. గోదావరి అవతలి ఒడ్డుకెళ్లి, తిరిగి వస్తుండగా తన స్నేహితులు ముగ్గురు మునిగిపోయినట్టు నవీన్ చెబుతున్నారు.

Similar News