హైదరాబాద్ లో డ్రగ్స్ రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్

Update: 2019-06-03 09:27 GMT

నగరంలో డ్రగ్స్ దందాకి ప్రయత్నిస్తున్న ముగ్గురిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 100 ఎమ్మెల్ హాష్ ఆయిల్, తొమ్మిది ఎక్తాసీ మాత్రలు, ఐదు ఎలేస్డీ సీసాలు, ఒక గ్రాము ఎం.డి.ఎం.ఎ స్వాధీనం చేసుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కే.భాస్కర్ ఓల్డ్ అల్వాల్ కు చెందిన విశాల్ స్నేహితులు. ఈ ఇద్దరూ కల్సి ఫిలింనగర్ దగ్గరలో ఒక రూములో ఉంటున్నారు. విశాల్ స్నేహితుడైన హైదర్ నగర్ కు చెందిన అభిలాష్ తో కల్సి డ్రగ్స్ దందా చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ ముగ్గురూ విశాఖపట్నం, బెంగుళూరు నగరాలనుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో అమ్మాలని ప్రణాళిక వేసుకున్నారు. ఇందులో భాగంగా డ్రగ్స్ కొనుగోలు కోసం భాస్కర్, విశాల్ బెంగుళూరు, హాష్ ఆయిల, ఎలేస్డీ సీసాలు కొనుగోలుకు అభిలాష్ విశాఖపట్నం వెళ్లి వాటిని నగరానికి తీసుకువచ్చారు. ఇక్కడ వాటిని అమ్మే ప్రయత్నంలో ఉండగా పోలీసులకు చిక్కారు. 

Similar News