ఘోర ప్రమాదం.. 21 మంది మృతి

మురాద్‌నగర్‌లో శ్మశానవాటిక ఘాట్‌ కాంప్లెక్స్‌లో.. కూలిన గ్యాలరీ పైకప్పు, 21 మంది మృతి ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కొనసాగుతున్న సహాయక చర్యలు

Update: 2021-01-03 16:11 GMT

 ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మురాద్‌నగర్‌లో వర్షం కారణంగా శ్మశానవాటిక ఘాట్‌ కాంప్లెక్స్‌లోని గ్యాలరీ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 21మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఘటనా స్థలంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 శశ్మాన వాటికలో ఓ వ్యక్తి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అటు వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక జరిగిన ఘటనపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని మీరట్‌ అధికారులను సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News