ప్రేమ వేధింపులకు యువతి బలి

Update: 2019-07-16 12:19 GMT

రంగారెడ్డి జిల్లా చౌదర్ ‌గూడ మండలం వీరన్నపేటలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన బాలిక రాజేశ్వరి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన నరేష్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. శేగిరెడ్డి ఘనపూర్‌లో పదోతరగతి చదువుతున్న రాజేశ్వరిని పాఠశాలకు వెళ్లి వచ్చే దారిలో వేధించేవాడు. అయితే గతంలో బాలిక తల్లిదండ్రులు అతన్ని మందలించిన ఆ యువకుడిలో ఎలాంటి మార్పురాలేదు. మళ్లీ వేధింపులు మొదలు పెట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాజేశ్వరి సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Full View

Tags:    

Similar News