రచ్చకెక్కిన ఎంపీ శశికళ పుష్ప రెండో పెళ్లి...

Update: 2018-03-21 05:45 GMT

వివాదాస్పద ఎంపీ శశికళ పుష్పపెళ్లి వివాదం రచ్చకెక్కింది. ఆమె పెళ్లి చేసుకోనున్న రామస్వామిపై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ, దినకరన్ వర్గీయురాలు శశికళ పుష్ప రెండో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ రామస్వామిని ఆమె పెళ్లాడబోతున్నారు. ఈనెల 26వ తేదీన వీరి వివాహం ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో రామస్వామిపై అతని మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2014లో రామస్వామితో తనకు వివాహం జరిగిందని మీడియాతో మాట్లాడుతూ ఆమె తెలిపింది. పెళ్లి ఫొటోను, తన బిడ్డతో కలసి రామస్వామితో ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ఆమె మీడియాకు చూపించింది. శశికళతో వివాహాన్ని అడ్డుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాహం అంశం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

Similar News