టీటీడీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు తొలగింపు అన్యాయమన్నారు రాజ్యసభ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. తిరుమల కొండపై జరుగుతున్నవి అక్రమాలేనన్నారాయన. కొన్నేళ్లుగా అర్చకత్వం చేస్తున్న రమణదీక్షితులు తొలగింపు అన్యాయం, అక్రమమేనన్నారు సుబ్రమణ్యస్వామి. టీటీడీలో లెక్కలేనన్ని అక్రమాలు జరుగుతున్నాయన్నారు స్వామి... జులై మొదటి వారంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు రాజ్యసభ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి