విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు...ఇంగ్లండ్ వెళ్లే ముందు అరుణ్ జైట్లీని...

Update: 2018-09-13 06:26 GMT

బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యా సంచలన రాజకీయ ఆరోపణ చేశారు. తాను భారతదేశం నుంచి బ్రిటన్ వెళ్ళే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని చెప్పారు. వెస్ట్ మినిస్టర్ కోర్టు బయట విలేకర్లతో మాట్లాడుతూ మాల్యా పలు సంచలన విషయాలు వెల్లడించారు. తాను భారతదేశం నుంచి బ్రిటన్ రావడానికి ముందు ఆర్థిక మంత్రి జైట్లీని చాలాసార్లు కలిశానని, బ్యాంకు రుణాల చెల్లింపుకు సంబంధించిన అనేక ఆఫర్లు ఇచ్చానని తెలిపారు. అయితే మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఆ వివరాలను తాను ఎందుకు చెప్పాలని ఎదురు ప్రశ్నించారు.

Similar News