ఉత్తర్ ప్రదేశ్ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ తన సిబ్బందితో చెప్పులు తుడిపించుకోవడం చర్చనీయాంశంగా మారింది. యూపీ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ కుషినగర్ లోని ఓ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగివెళుతుండగా ఆయన చెప్పులపై పడ్డ మట్టి, నీళ్లను సిబ్బంది ఎరుపురంగు టవల్ తో శుభ్రం చేశారు. దీన్ని మీడియా ప్రసారం చేయడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఓ మంత్రి అయ్యుంటి సిబ్బందితో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.