ఈవీఎంలపై ఓ కన్నేసి ఉంచండి: ఉత్తమ్

Update: 2018-12-08 08:36 GMT


తెలంగాణలో హోరాహోరి మహాయుద్దం నిన్నటితో ముగిసింది. కాగా ఎగ్జిట్ పోల్స్ కూడా తమ తీర్పును వెల్లడించాయి. ఈ విషయంపై ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమికే అధికారం దక్కుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్‌కు ఓటమి తప్పదని తెలంగాణలో ప్రజాకూటమి అభ్యర్ధుల విజయం సాధిస్తారని తెలిపారు. కాగా ఈవీఎంల విషయంలో ప్రజాకూటమి అభ్యర్థులు ఓ కన్నేసి ఉండాలని ఉత్తంకుమార్ రెడ్డి సూచించారు. రవణా సమయంలో ఈవీఎంలు సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలని, ఈవీఎంలను ఉంచిన గదులను పరిశీలించాలని ఉత్తం ట్వీట్ చేశారు. కౌంటింగ్ సమయంలో  ఈవీఎంలను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని నేతకు సూచించారు. ఈవీఎంల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. కాగా జాతీయ చానల్స్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారమని అంచనా వేస్తే విశ్వసనీయతకు మారుపేరైన లగడపాటి సర్వే మాత్రం కూటమికి మెజారిటీ వస్తుందని అంచనా వేసింది. చివరికి గెలుపు ఎవరిని వరిస్తోందో చూడాల్సిందే.

Similar News