టీఆర్ఎస్ అభ్యర్థులకు బీపారాలు అందచేసే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫారాలు అందజేస్తారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమవుతారు. ఇదే సమావేశంలో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులందరికి బీ ఫారాలు ఇస్తారు. అలాగే ఆదివారం గజ్వెల్ కార్యకర్తలతో సీఎం సమావేశం అవుతారు. ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సమావేశానికి 15వేల మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హాజరవుతారని పార్టీ వర్గాల సమాచారం.