రేపు పీపుల్స్ ఫ‌్రంట్ మేనిఫెస్టో విడుదల..

Update: 2018-11-18 09:31 GMT

ప్రజలంటే పట్టింపులేకుండా ఇష్టానుసారంగా అధికారం చెలాయించే వాళ్లకు పాలించే అర్హత లేదన్నారు పీపుల్స్ ఫ్రంట్ కన్వీనర్ కోదండరాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా తమ మేనిఫెస్టో ఉందని, రేపు తమ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నామని ఆయన చెప్పారు. సాయంత్రంలోగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. కోదండరాం మాట్లాడుతూ ఓట్లుకొనుక్కోవడంతోని రాజకీయాలు మారుతయని తను అనుకోవడంలేదని ప్రజలకు రాజకీయాల్లో ఎటువంటి లాభం జరుగుతదో, రాజకీయాల ద్వారా ఎలంటి మేలు చేయోచ్చో ప్రజలకు మనం నచ్చజేబితే ఖచ్చితంగా ప్రజల మద్దత్తు పొందుతామని కోదండరాం స్పష్టం చేశారు.

Similar News