అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో అర్ధరాత్రి చోరీకి పాల్పడి బంగారం, డబ్బులు ఎత్తుకెళ్లారు. దుండగులను ఎదిరించే క్రమంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎస్2, ఎస్12 బోగీల్లో దోపిడి జరిగినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై గుత్తి రైల్వే పోలీసులకు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.