విడాకులు అందుకే తీసుకుంటున్నాం : తేజ్ ప్రతాప్ యాదవ్

Update: 2018-11-03 16:00 GMT

అతిరధ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగినా అది మూన్నాళ్ళ ముచ్చటే అయింది. ఆరునెలలు కిందటే ఒకరినొకరు ప్రేమించి పెళ్ళిచేసుకుని ఒక్కటైన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యా రాయ్ దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తనకు విడాకులు కావాలని పాట్నా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు తేజ్. అయితే విడాకులు ఎందుకు తీసుకోవలసి వచ్చింది అనే విషయాన్నీ అయన ఇవాళ మీడియాకు వివరించాడు. 'ఇది నిజం.. నేను నా భార్య నుంచి విడాకులు కోరుకుంటున్నాను. మా ఇద్దరి అభిప్రాయాలు ఏమాత్రం కలవలేదు. ఆలోచనల్లోను, అభిరుచుల్లోనూ మేము ఇద్దరం ఉత్తర, దక్షిణ ధృవాల వంటి వాళ్లం. మేం కలిసుండటం అసాధ్యం. మేం చాలాసార్లు మా తల్లిదండ్రుల ముందే గొడవపడ్డాము. ప్రతి చిన్న విషయానికి గొడవపడటం తప్ప ఈ ఆర్నెళ్ల జీవితంలో మేం సంతోషంగా గడిపిన క్షణాలు లేవు. కలిసి ఉంటూ బాధపడే కంటే.. విడిపోయి సంతోషంగా ఉండటం మంచిదనిపించింది. అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను' అని తేజ్ ప్రతాప్ యాదవ్ వెల్లడించాడు.

Similar News