కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీని టీడీపీ కైవసం చేసుకుంది. ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నామినేషన్ల పర్వానికి ముందే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పోటీ నుంచి వైదొలిగింది. బీఎస్పీ అభ్యర్థి దండు శేషు యాదవ్ నామినేషన్ ను తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పులి జయప్రకాష్ రెడ్డి ఇవాళ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అటు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు, మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి నాగిరెడ్డి తన నామినేషన్ కు ఉపసంహరించుకున్నారు. దీంతో కేఈ ప్రభాకర్ ఏకగ్రీవ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది.