విజయవాడ సివిల్ సప్లయి కార్యాలయంలోని లిఫ్ట్లో టీడీపీ నేతలు ఇరుక్కున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా చల్లా రామకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డితో పాటు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఇతర నేతలు హజరయ్యారు. ఈ సందర్భంగా లిఫ్టులో వెళుతుండగా ఒక్కసారిగా మధ్యలోనే ఆగిపోయింది. పైకి తెచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో రాడ్లతో లిఫ్ట్ తలుపులు బద్ధలు కొట్టి 15 నిమిషాల అనంతరం బయటకు తీశారు. ఎవరికీ ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.