జగన్ పర్యటించిన ప్రాంతంలో పసుపు నీళ్లతో శుద్ధి

Update: 2018-03-31 10:17 GMT

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైయస్ వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగిసింది. తన పాదయాత్ర సందర్భంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పై జగన్ విమర్శలు వర్షం కురిపించారు. జగన్ విమర్శలపై శ్రీధర్ కూడా స్పందించారు. తాను అవినీతికి పాల్పడినట్టు జగన్ నిరూపిస్తే... రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.  ఈ నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గంలో జగన్ పర్యటించిన ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు పసుపు నీళ్లను చల్లి రోడ్లను శుద్ధి చేశారు. జగన్ రాకతో తమ ప్రాంతం మలినమైందని.. అందుకే శుద్ధి చేస్తున్నామని తెలిపారు.

Similar News