ఇదిగో ఆ కిలాడీ లేడీ ఈమె. పేరు స్వాతి. పక్కనే నవ్వుతూ దిగిన ఫోటో భర్తది. పేరు సుధాకర్రెడ్డి. పెళ్లికి ముందే రాజేష్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న స్వాతి జబర్దస్త్ డ్రామా ఆడింది. ఆ విషయాన్ని దాచిపెట్టి గుట్టుగా పెళ్లికి ఒప్పుకుంది. కానీ ప్రియుడిపై మోజు తీరలేదు. అతనితో కలసి జీవించాలన్న ఆశ చావలేదు.
కానీ లోకం ఒప్పుకోదు కదా! భర్త ఉండగా... ప్రియుడితో కలసి తిరుగుతుంటే ప్రపంచం మెచ్చదని తెలసి ఓ దారుణానికి ఒడగట్టింది.
గత నెల 28న అలా తిరుగొద్దామని భర్తను నమ్మించి బయటకు తీసుకెళ్లిన స్వాతి ఖతర్నాక్ స్కెచ్ను అంతే ఖతర్నాక్గా అమలు చేసింది. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం ప్రియుడు రాజేష్తో కలసి భర్తను కడతేర్చింది స్వాతి. అప్పుడే స్వాతికి ఓ థాట్ వచ్చింది. ప్రియుడు రాజేషే తన భర్తగా ప్రపంచానికి చూపించాలని చూసింది. ఎలాగైనా ప్రియుడితో ఉండాలన్న బలమైన కోరికతో స్వాతి ప్రియుడి ముఖంపై యాసిడ్ పోసేసింది. అలా వైద్యం చేయించి... బాగవగానే భర్తగా చెలామణిలోకి తీసుకురావాలని ప్లాన్ వేసింది.
ఇక్కడ ఇంకో దారుణం గురించి చెప్పుకోవాలి. భర్తను చంపేసి విషయం బయటకు రాకుండా జాగ్రత్త తీసుకున్న స్వాతి... అదే విషయాన్ని అత్తామామలకు చెప్పి నమ్మించింది. ఎవరో యాసిడ్ ఎటాక్ చేశారని ప్రియుడినే భర్తగా చూపించింది. స్వాతి చెప్పిందంతా నిజమే అనుకున్న ఆ మృతుడి తల్లిదండ్రులు కొడుకును చంపిన వ్యక్తి ఆరోగ్యం కోసం... యాసిడ్ దాడికి వైద్యం కోసం అక్షరాల ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయినా ఎక్కడో అనుమానం. స్వాతి మీద అపనమ్మకం. ఎంతయిన రక్తసంబంధం కదా?
అప్పటికే భర్తను హతమార్చి, ప్రియుడు రాజేషే భర్తగా అందరిని నమ్మించిన స్వాతి... గాయపడింది సుధాకర్రెడ్డేనని ఇతర కుటుంబసభ్యులు కూడా నమ్మేలా బిహేవ్ చేసింది. ఆసుపత్రిలో గాయాల నుంచి కొంచం తేరుకుంటున్న రాజేష్తో స్వాతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అసలు విషయం ఏంటో కనుక్కునే ప్రయత్నం చేశారు. కచ్చితంగా ఈ వ్యక్తి తమ కొడుకు కాదంటూ పోలీసులను ఆశ్రయించడంతో అసలు గుట్టు రట్టయింది.
ఇంకేముంది పోలీసులు రంగంలోకి దిగారు. అచ్చం సినిమాటిక్గా, క్యూరియాసిటిక్గా సాగిన డ్రామాలో... అసలు నిజమేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి పోలీసులకు పెరిగింది. అంతే తమదైన స్టైల్లో ఎంక్వయిరీ ప్రారంభించారు. అసలు నిజాన్ని తేటతెల్లం చేశారు. స్వాతిని విచారించిన పోలీసులు... ప్రియుడితో కలసి భర్త సుధాకర్రెడ్డిని నవాబ్పేట వద్ద హత్య చేసినట్టు ఒప్పుకుంది. ప్రియుడే తన భర్తగా నమ్మించేందుకు యాసిడ్ పోసిందీ నిజమేనని అంగీకరించింది.