విభజన హామీలను అమలు చేయాలంటూ లోక్సభలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం లోక్సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మరోవైపు సభలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ సభాపక్ష ఉపనేత జ్యోతిరాదిత్యతో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహం, రామ్మోహన్నాయుడు మంతనాలు జరిపారు. ఏపీలో పరిస్థితిని సోనియాకు ఎంపీలు వివరించారు. తమకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారిని కోరారు.