జనం మీద దూసుకెళ్లినకారు…ఏడుగురు మృతి

Update: 2018-08-01 08:40 GMT

తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సుందరాపురం సమీపంలో ఒక కారు వేగంగా వచ్చి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు కళాశాల విద్యార్థులు ఉన్నారు. మరో ఏడుగురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగంతో దూసుకొచ్చిన కారు జనంపైకి వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Similar News