హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్‌

Update: 2018-11-20 09:27 GMT

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్ తగిలింది. టికెట్ దక్కలేదని నిరాశతో అధికార ప్రతినిధి తుమ్మేటి సమ్మిరెడ్డి, సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గూలాబీ తీర్ధంపుచ్చుకున్నారు. ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ పాడి కౌశిక్‌రెడ్డికి ఇవ్వడంతోనే అసంతృప్తితోనే తాము గూలాబీ తీర్ధం పుచ్చుకున్నామని నేతలు తెలిపారు.

Similar News