ఘోర రైలు ప్రమాదం.. 50 మందిపైగా మృతి

Update: 2018-10-20 01:18 GMT

పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అమృత్‌సర్‌ దసరా వేడుకల సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50 పైగా మృతి చెందినట్టు సమాచారం. రావణ దహనం సందర్భంగా పట్టాలపై నిలబడి ఉన్న వారిపై రైలు దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది సంఘటనా స్థలంలో ఉన్నవారందరినీ ఖాళీ చేయించారు, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్నవెంటనే ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ, పంజాబ్ ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Similar News