జమ్మూకశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. సరదా గడుపుదామని వెళ్లిన యువకులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్లోని రియాసి జిల్లా సియార్బాబా జలపాతం చాలా ఫేమస్. ఈ జలపాతం అందాలను చూసిన తర్వాత యువకులంతా కలిసి స్నానం చేసేందుకు జలపాతంలోకి దిగారు. యువకులు జలకాలాడుతుండగా పెద్ద బండరాయి యువకులపై పడింది. దీంతో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.