బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ల మ్యారేజ్ రిసెప్షన్ కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. సినీ, రాజకీయ, పోలీసు, క్రీడా ప్రముఖుల మధ్య విందు కార్యక్రమం కన్నులపండువగా సాగింది. నోవాటెల్లో జరిగిన ఈ వేడుకల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానం నాగేందర్, పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు. అక్కినేని నాగార్జున అమల దంపతులు, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, హీరో సుధీర్బాబు, కల్యాణ్ శ్రీజ దంపతులు ఈవెంట్కు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. రాచకొండ పోలీసు కమిషనర్లతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.