దేశవ్యాప్తంగా 4 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి రౌండ్లలోనే బీజేపీకి గట్టి పోటీ ఎదురైంది. ఉత్తరప్రదేశ్ లో కీలకంగా భావించిన కైరానాని యోజకవర్గంలో ఆర్ఎల్డీ ముందంజలో ఉండగా, మహారాష్ట్రలోని పాల్ఘడ్లో విజయం బీజేపీని దోబుచులాడుతోంది.
కర్ణాటక ఆర్ఆర్ నగర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. తొలిరౌండ్లోనే అక్కడి కాంగ్రెస్ అభ్యర్థికి 4వేలకు పైచిలుకు ఆధిక్యం దక్కింది. ఇక ఉత్తర ప్రదేశ్లోని నూర్పూర్ అసెంబ్లీ స్థానం నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మహేస్తల-పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అభ్యర్థి ఆధిక్యం కనబరుస్తున్నారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కైరానాలో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ బిజెపి అభ్యర్ధి కన్నామ్రిగాంకా సింగ్ ముందంజలో కొనసాగుతున్నట్లు తొలి ట్రెండ్స్ చెబుతున్నాయి.