టెలికాం రంగంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు రిలయన్స్ జియో మరో అడుగు ముందుకేసింది. రూ. 799 రూపాయలతో సరికొత్త ప్లాన్ను లాంచ్ చేసిన రిలయన్స్ జియో, వెంటనే మరో ఆఫర్ను ప్రకటించింది. తన 299 రూపాయల ప్యాక్ను సమీక్షించింది. ఈ సమీక్షించిన ప్యాక్ కింద అదనంగా రోజుకు 1.5జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు రిలయన్స్ జియో పేర్కొంది. ఇప్పటికే ఈ ప్యాక్పై రోజుకు 3 జీబీ డేటా అందుబాటులో ఉండగా.. ఇక నుంచి మొత్తంగా 4.5జీబీ డేటాను యూజర్లు అందుకోనున్నారు.ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకే అందుబాటులో ఉండనుంది.