గుజరాత్‌లో నైతిక విజయం మాదే: రాహుల్‌

Update: 2017-12-19 09:25 GMT

గుజరాత్‌ ఎన్నికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. గుజరాత్‌లో బీజేపీ గెలిచినా నైతికంగా తామే విజయం సాధించామని స్పష్టం చేశారు.  ‘గుజరాతీయులు నా పట్ల చాలా ప్రేమాభిమానాలు చూపించారు. భాజపా నేతలు గుజరాత్‌ మోడల్‌ అని ప్రచారం చేశారు. మూడు నెలల క్రితం గుజరాత్‌ వెళ్లినపుడు భాజపా ముందు కాంగ్రెస్‌ నిలబడలేదన్నారు. కానీ ఇప్పుడు భాజపాకు గట్టి పోటీ ఇవ్వగలిగాం. ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయి’. ఎన్నికల ప్రచారంలో కులాలు, మతాల గురించి మాట్లాడిన మోడీ అమిత్‌ షా కొడుకు జే షా గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

Similar News