రాఫెల్ ఒప్పందం విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై తన విమర్శనాస్త్రాలు సంధించారు. రాఫెల్ పేరుతో మోదీ, అనిల్ అంబానీలు రక్షణశాఖపై సర్జికల్ దాడులు చేశారని దుయ్యబట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే చేసిన వ్యాఖ్యలపై మోడీ ఇప్పటికైనా స్పందించాలని రాహుల్ డిమాండ్ చేశారు. యుద్ధ విమానాల ధరల విషయంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెబుతున్నారని రాహుల్ మండిపడ్డారు. ఈ స్కాంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.