రాహుల్ గాంధీ ‘పకోడా’ బ్రేక్...!

Update: 2018-02-12 12:40 GMT

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్ని టీ స్టాల్ లో కూర్చొని పకోడీ తిన్నారు. టీ తాగారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఊహించని విధంగా ఇలా చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఉన్నారు.

పకోడీలు అమ్మడం కూడా ఉద్యోగమేనంటూ ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఆగి మరీ మిర్చి పకోడాలు తినడంపై ఆసక్తికర చర్చ సాగింది. కాగా ఇవాళ ఉదయం రాహుల్ సీఎం సిద్ధరామయ్యను వెంటబెట్టుకుని రాయ్‌చూర్‌లోని దర్గాను దర్శించారు. అనంతరం నగరంలో రోడ్‌షో నిర్వహించారు.

Similar News