ఈ దళిత కుర్రాళ్ళు చేసిన తప్పేంటి.. రాహుల్ ప్రశ్న!

Update: 2018-06-15 12:40 GMT

మహారాష్ట్రలోని జల్గావ్‌లో దళిత బాలురపై గ్రామస్తుల పైశాచిక దాడిని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఖండించారు. బీజేపీ, ఆరెస్సెస్ పాటిస్తున్న విషపూరిత రాజకీయాలు దేశాన్ని ఎటువైపునకు తోసుకెళ్తున్నాయో గమనిస్తున్నారా.. అంటూ  రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇద్దరు దళిత యువకుల్ని మొండిమొలపై నిలబెట్టి బెత్తంతో చితక్కొడుతున్నప్పటి వీడియో ఇది. ఈ దళిత పిల్లలు చేసిన తప్పేమిటంటే.. అగ్రవర్ణాల వారికి చెందిన ఫామ్ లోని బావిలో ఈత కొట్టడం! మానవత్వం ఆఖరి దశలో పడింది..! అంటూ కామెంట్ పెట్టాడు రాహుల్. 
 

Similar News