రాఫెల్ డీల్ వ్యవహారంలో బీజేపీపై రాహుల్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. రాఫెల్ స్కాం వెనుక మోడీ, అనిల్ అంబానీ ఇద్దరే ఉన్నారని తెలిపారు. నష్టాల్లో ఉన్న అనిల్ అంబానీ కంపెనీలో డసాల్ట్ తొలివిడతగా 284 కోట్లు జమచేసిందన్నారు. భూమి కొనుగోలుకు కూడా డసాల్ట్ నిధులు ఇచ్చిందని తెలిపారు. రాఫెల్ స్కాంను దర్యాప్తు చేస్తున్నారనే సీబీఐ చీఫ్ ను మార్చారని చెప్పారు.